అక్షరాలను లాలించాలని నేను కూర్చుంటే..
తలపువై రాయమంటూ ఎదురవుతావు..
దాచుకున్న మాటలన్నీ రాసేలోపుగా..
పెదాలపై పాటగా వచ్చి ఆలాపనవుతావు..
మదిలోని మోహానికి మరువాన్ని జల్లి..
మల్లెల్లో కూర్చి దారంతో కట్టేలోపే..
పరిమళాల ప్రకంపనై చుట్టుముడతావు..
కవిత్వాన్ని కలంలో కూరేలోపునే..
అల్లిబిల్లి సల్లాపాలను మొదలెడతావు..
విరిసుగంధాల క్షణాలను రాసేలోపే..
నన్నల్లరిపెట్టి ఆలింగనం చేసి అల్లుకుపోతావు..
మోహనమయిందంటే మౌనం..
అవదూ మరీ...
శృతి చేసి మరీ మనసును పాడిస్తుంటే..
పల్చని వెన్నెలేనని నేను పట్టించుకోకున్నా..
నిండు చందమామనే చూపిస్తావుగా ప్రేమలో..!!
No comments:
Post a Comment